- Advertisement -
మన తెలంగాణ/కొల్లాపూర్ టౌన్: రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు ఆర్టిసి కార్గో సర్వీసుల సేవలను ఉపయోగించుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్టిసి డిపో మేనేజర్ వరప్రసాద్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టిసి కార్గోసర్వీసులు తక్కువ ధరకే గ్రామాలలోని రైతుల వ్యవసాయ పొలాల్లో దగ్గరికి వచ్చి ధాన్యాన్ని తరలిస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్గోసేవలు అవసరం ఉన్న వారు ఫోన్ నెంబర్ 9154298611 సంప్రదించాలని కోరారు.
- Advertisement -