Friday, March 29, 2024

ఆర్‌టిసి ఎండి సజ్జన్నార్‌ను కలిసిన యూనియన్ నాయకులు

- Advertisement -
- Advertisement -

TSRTC Union leaders meet with Sajjanar

మన తెలంగాణ, సిటీబ్యూరో: టిఎస్‌ఆర్‌టిసి నూతన మేనేజింగ్ డైరక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన విసి. సజ్జన్నార్‌ను మంగళవారం బస్‌భవనలోని ఆయన చాంబర్‌లో టిఎస్‌ఆర్‌టిసి ఎంప్లాయిస్‌యూనియన్ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాజిరెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్‌టిసి అభివృద్దిలో భాగంగా యూనియన్ల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఎండికి విజ్ఞప్తి చేయగా దానికి ఎండి సజ్జన్నార్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెగ్యులర్ ఎండిగా సజ్జన్నార్ నియమాకాన్ని స్వాగితిస్తున్నట్లు తెలిపారు. ఆర్‌టిసి రక్షణే కాకుండా , కార్మికుల హక్కులను కాపాడే విధంగా ఎండి వ్యవహరిస్తారాని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.ఎండిని కలిసివారిలో ఎంప్లాయిస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి అహ్మద్ అలీ, రాష్ట్ర కోశాధికారి త్రిలోచన, కార్యదర్శులు రామిరెడ్డి, డి. వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News