హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఎట్టకేలకు ఆర్టిసి బస్సులు బుధవారం నుంచి రోడ్డెక్కనున్నాయి. ఇందుకోసం ఆర్టిసి అధికారులు రంగం సిద్ధంచేశారు. ప్రయోగాత్మకంగా మొదటివిడతగా ఒక్కో డిపో నుంచి 10 నుంచి 15 బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసిన లాక్డౌన్తో మార్చి 20 నుంచి ఆర్టిసి బస్సులు డిపోలకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే, జిల్లాల బస్సులను గత రెండునెలలుగా నడుపుతున్నా…. కరోనా తీవ్రత దృష్టా నగరంలో ఇప్పటివరకు నడపలేదు. అయితే, ఎట్టకేలకు బుధవారం నుంచి నడపాలని ఆర్టిసి యంత్రాంగం నిర్ణయించింది. కోవిడ్ నిబంధనలకు అనుగూణంగా ఈ బస్సులను నడిపిందుకు అన్ని ఏర్పాట్లుచేసింది. ముందుగా శివారులోనే ఎక్కువగా బస్సులను నడిపేందుకు ఆర్టిసి సన్నాహాలు చేసింది. క్రమంగా పూర్తిస్థాయిలో బస్సులను తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.
TSRTC will operate the buses from tomorrow