- Advertisement -
తిరుపతి: టిటిడి ఆస్తులు, కానుకలు విక్రయించొద్దని పాలకమండలి నిర్ణయించింది. నిరుపయోగంగా ఉన్న టిటిడి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఒక నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు టిటిడి ఛైర్మన్ వైవి సబ్బారెడ్డి తెలిపారు. ఈ కమిటీలో పీఠాధిపతులు, భక్తులు సభ్యులుగా ఉంటారని ఆయన చెప్పారు. తిరుమలలో అతిధి గృహం కేటాయింపుల్లో పారదర్శకత ఉంటుందని, పాత అతిథి గృహాలు పునర్ నిర్మించేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. టిటిడి ఆధ్వర్యంలో త్వరలో చిన్న పిల్లల ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు శ్రీవారి దర్శనాలకు అనుమతి ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
TTD to Allow Devotees for Darshan after Lockdown
- Advertisement -