Saturday, April 20, 2024

చెరువులో కవలల మృతదేహాలు… అపస్మారక స్థితిలో జంట

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా చింతపర్తివారి పల్లెలో మంగళవారం ఉదయం  విషాదం చోటుచేసుకుంది. నడిమోడుకుంట చెరువులో ఇద్దరు పిల్లల మృతదేహాలు కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం. చెరువు పక్కన ఉండే పొదల్లో ఓ మహిళ, వ్యక్తి అపస్మారక స్థితిలో కనిపించారు. వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు… సదరు మహిళ పులిచిచర్ల మండలం రామిరెడ్డి పల్లికి చెందిన హేమశ్రీగా గుర్తించారు. చెరువులో పడిన కవలలు పునీత్, పునర్వి అని, పిల్లల తండ్రి వెంకటేశ్వర్ రెడ్డి అని తెలియడంతో అతడికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలంలో పడి ఉన్న వ్యక్తి ఉదయ్ కుమార్ గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. పిల్లలని చెరువులో పడేసి హేమ శ్రీ, ఉదయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News