Friday, April 19, 2024

జంపన్న వాగులో మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

two bodies found in Jampanna Vagu

ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జంపన్న వాగులో ఈ నెల 12 న గల్లంతైన భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొత్తకొండాపూర్ కు చెందిన బంగారి శ్యామల్ రావు, ఉడిమడి కోటేశ్వర్‌రావు ల మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. మేడారం వన దేవతల దర్శనానికి వచ్చి గల్లంతైన వారి కోసం గత మూడు రోజులుగా తాడ్వాయి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా శ్యామల్ రావు మృతదేహం మేడారం జంపన్న వాగులో జంట వంతెనల పరిసరాలలో లభ్యం కాగా ఉడిమడి కోటేశ్వర రావు మృతదేహం వాగులో వరద ఉధృతిగా ప్రవహించడంతో ఏటూర్‌నాగారం లోని గోదావరి లో జంపన్నవాగు కలిసే ప్రాంతంలో లభ్యమైనట్లు తాడ్వాయి ఎస్సై సిహెచ్ వెంకటేశ్వర రావు తెలిపారు. శ్యామల్ రావు బావ నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, మృతదేహాలను ఏటూర్ నాగారం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.

two bodies found in Jampanna Vagu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News