Wednesday, April 24, 2024

ఇద్దరు చిన్నారుల అనుమానస్పద స్థితిలో మృతి

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: బాన్సువాడ సమీపంలోని కాలువలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. తల్లి చిన్నారులను పడేసినట్లుగా చెబుతుండగా, ఆమె మాత్రం ఆటో డ్రైవర్ పడేస్తే తాను కాల్వలో దూకి పిల్లలను కాపాడే ప్రయత్నం చేసినట్లు చెబుతోంది. నిజామాబాద్ జిల్లా గోళ్ల గుట్ట కు చెందిన అరుణ, మోహన్లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నారులను 8 నెలల పసిపాప, 4 సంవత్సరాల బాబుగా గుర్తించారు. కాలువలోంచి పిల్లలను తీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News