Thursday, April 25, 2024

భైంసాలో ఇరువర్గాల ఘర్షణ..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/నిర్మల్:  జిల్లాలోని భైంసాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనల్లో వాహనాలకు, దుకాణాలకు పలువురు దుండగులు నిప్పు పెట్టారు. సమస్యాత్మక ప్రాంతమైన జుల్ఫీకర్ గల్లీలో ఘర్షణలు జరిగాయి. యువకుల మధ్య జరిగిన చిన్న గొడవ ఘర్షణకు దారి తీసింది.ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకున్నారు. పోలీసులు అల్లరిమూకను చెదరగొట్టేందుకు యత్నిస్తునారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేస్తున్నారు.

Two Communities Clashes in Bhainsa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News