- Advertisement -
సంగారెడ్డి: ఆర్సిపురం మయూరినగర్లో ఇద్దరికి కరోనా సోకిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆర్సిపురం మయూరినగర్లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వారిని ప్రైవేటు ఆస్పత్రి నుంచి గాంధీకి తరలిస్తామన్నారు. పాజిటివ్ కేసులు వచ్చినవారిని, వారితో సన్నిహతంగా ఉన్నవారిని గుర్తించా ఐసోలేషన్కు పంపుతామన్నారు. ప్రజలు ఎవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. కరోనాపై స్థానికులకు మంత్రి హరీష్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ మహిపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు.
- Advertisement -