- Advertisement -
కిన్షాసా : డిఆర్ కాంగోలో గత ఇరవై నెలలుగా కనిపించని ఎబోలా వైరస్ అంతమై పోయిందనుకున్న తరుణంలో మళ్లీ రెండవ సారి కనిపించడంతో కాంగోతోపాటు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆశలకు నీళ్లు వదలినట్టు అయింది. ఇరవై నెలలుగా ఎబోలా వైరస్ కేసులు లేకపోవడంతో దాదాపు ఇది అంతమైందన్న విశ్వాసంతో ఆదివారం ఈ వైరస్ అంతమైందని కాంగో ప్రకటించాలనుకుంది. అలాగే సోమవారం ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈ వైరస్ ఇక లేనట్టే అని ప్రకటించడానికి సిద్ధమైంది. కానీ శుక్ర, ఆదివారాల్లో కాంగోలో బేణీ నగరంలో మళ్లీ ఎబోలా వైరస్తో ఇద్దరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం 26 ఏళ్ల యువకుడు, ఆదివారం యువతి ఈ వైరస్ బారిన పడి మృతి చెందారు. 2018 ఆగస్టు 1 న కాంగోలో ఎబోలా వైరస్ ప్రారంభమై 2276 మంది ప్రాణాలు కోల్పోయారు.
Two dead in Ebola again in Congo
- Advertisement -