Friday, April 19, 2024

మహబూబ్‌నగర్‌లో రోడ్డుప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

two death in road accident at Bhuthpur

భూత్పూరు:  మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూరు మండలం చెవులతండా దగ్గర బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం  సమీప ఆస్పత్రికి తరలించగారు. టిప్పర్‌- ఆటో ఢీకొనడంతో ఈ ఘటనలో చోటుచేసకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులు బిజినేపల్లి మండలం మంగనూరుకు చెందిన సత్యనారాయణ (37), వెంకటయ్య (47)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

two death in road accident at Bhuthpur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News