- Advertisement -
రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద ఓఆర్ఆర్ పై ఆదివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. అతివేగం ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను డ్రైవర్, క్లీనర్ గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Two Death in Road Accident At Himayat Sagar
- Advertisement -