- Advertisement -
నిర్మల్: జిల్లాలోని కడెం మండలం ఉడుంపూర్ వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ఓ బైక్ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగనే ఉందని డాక్టర్లు వెల్లడించారు.
Two death in road accident at Nirmal district
- Advertisement -