- Advertisement -
దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకును ఆటో ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. వారిపైకి ఓ ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అశ్వారావుపేట మండలం కేసప్పడూడెం, ఊట్లపల్లి వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
two died in road accident at bhadradri kothagudem
- Advertisement -