మునగాల: సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం ముకుందాపురం గ్రామ స్టేజ్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడగా… మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం ఆస్సత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ఏపీ 28 సీడీ 6851 నంబరు గల ఇండికా కారు వేగంగా వెళ్తుంది. మునగాల మండలం ముకుందాపురం వద్ద రాగానే ట్రాక్టర్ను వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లా రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తోన్న చంద్రశేఖర్ కారును ఆయన బంధువులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో మహిళ పేరు కొల్లపూడి ధనలక్ష్మి కాగా మరొకరి పేరు తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పేరు పెండ్యాల సాయి సందీప్గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుదేహలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
two died in road accident at suryapet district