Saturday, April 20, 2024

స్నానానికి వెళ్లి ఇద్దరు బాలికలు మృతి

- Advertisement -
- Advertisement -

Two girls dead in Lingam Lake in Medchal

హైదరాబాద్: స్నానాలకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి చెందిన సంఘటన మేడ్చల్ జిల్లా కొంపల్లి మున్సిపాలిటీ దూలిపల్లి లింగం చెరువులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దూలపల్లి శివారులో ఓ కుటుంబం చిత్తుకాగితాలు ఎరుకొని జీవనం సాగిస్తున్నారు.  లింగం చెరువులోకి బట్టలు వాష్ చేసుకొని స్నానాలు చేస్తుంటారు. సోమవారం ఇద్దరు బాలికలు లింగం చెరువులో స్నానం చేస్తుండగా మునిగిపోయారు. పశువుల కాపరి గమనించి వాళ్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. చెరువులో ఎంత గాలించినా వారు మృతదేహాలు కనిపించలేదు. గజ ఈత గాళ్ల సహాయంతో గాలించగా ఒక బాలిక మృతదేహం కనిపించింది. మంగళవారం ఉదయం మళ్లీ గాలించగా మరోక బాలిక మృతదేహం దొరికింది. మృతులు కరీనా(12), సంజన(13)గా గుర్తించారు. శవ పరీక్ష నిమిత్తం వారి మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News