Friday, March 29, 2024

కారు బోల్తాపడి ఇద్దరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Two injured in car accident in Adilabad

నేరడిగొండ: అతివేగంతో వెళ్తున్న కారు బోల్తాపడి ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గుడిహత్నూర్ మండలంలోని మన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించింది స్థానికులు తెలిపారు. మన్నూర్ గ్రామానికి చెందిన ఐదుగురు మిత్రులు ఎంహెచ్ 17బిఎక్స్ 5562 బ్రీజా కారులో కుంటాల జలపాతం వీక్షించి, తిరుగివస్తున్నారు. సావర్ గాం సమీపంలో అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు  డ్రైవర్‌కు మలుపు కనిపించకపోవడంతో రోడ్డు పక్కనున్న కాల్వలోకి తీసుకెళ్లి బోల్తా పడింది. కారును గమనించిన స్థానికులు కారులోని అందరిని బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ అస్పత్రికి తరలించారు.

Two injured in car accident in Adilabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News