ఊర్కొండ: ట్రాక్టరు వెనకాల బైకు బలంగా ఢీ కొట్టి ఇద్దరు మృతి, ఒక్కరికి తీవ్ర గాయాలైన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని కల్వకుర్తి-జడ్చర్ల ప్రధాన రహదారిపై జిన్నింగ్ మిల్లు సమీపంలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకున్నది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాజిపేట మండలంలోని లక్ష్మణ్నాయక్ తండాకు చెందిన వాల్యనాయక్, రాములు నాయక్, అదే మండలంలోని గోరిటకు చెందిన మల్లయ్యలు ముగ్గురు ఒకే బైకుపై కల్వకుర్తి వైపు వెళుతున్నారని అన్నారు.
మిడ్జిల్ మండలంలోని అయ్యవారిపల్లికి చెందిన ట్రాక్టర్ రహదారిపై డిజిల్ అయిపోవడంతో అక్కడే నిలిపారు. బైకుపై వేగంగా వచ్చి ట్రాక్టర్ వెనకాల నుండి బలంగా ఢీ కొట్టడంతో వాల్యనాయక్, రాములునాయక్ అక్కడికక్కడే మృతి చెందగా, మల్లయ్య తీవ్రగాయాల పాలయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకి చేరుకొని 108 వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయ్కుమార్ తెలిపారు.
Two killed Bike collides with tractor in Nagarkurnool