Saturday, April 20, 2024

కొడంగల్‌లో కారు- బైకు ఢీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

two killed car collides with bike in vikarabad

కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం తుంకిమెట్ల వద్ద శుక్రవారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు, బైకు ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News