Friday, March 29, 2024

పూణెలో ముఠాల మధ్య కాల్పులు.. ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Two killed in gunfight in Pune

పూణె: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో శుక్రవారం రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉరులీకంచన్‌చౌక్‌లో ఈ ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్ వద్ద జగ్‌తాప్ అనే ముఠానేతపై నలుగురు వ్యక్తులు కాల్పులు ప్రారంభించగా, అతని అనుచరులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జగ్‌తాప్‌తోపాటు అతని వైరి ముఠాకు చెందిన ఓ వ్యక్తి చనిపోయాడని డిప్యూటీ పోలీస్ కమిషనర్ నమ్రతాపాటిల్ తెలిపారు. ఈ ఘటనలో జగ్‌తాప్ వర్గానికి చెందిన ఇద్దరు గాయపడగా, వారిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ రెండు ముఠాల మధ్య గత వైషమ్యాలే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. దౌండ్ తహశిల్‌లోని రాహు గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో జగ్‌తాప్ నిందితుడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News