అమరావతి: అనంతపురం జిల్లా బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీ వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా… మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. రెండు వాహనాలు వేగంగా వచ్చి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
Two Killed in Road Accident at Anantapur