- Advertisement -
హైదరాబాద్: జనగామ జిల్లాలోని తరిగొప్పుల మండలం అక్కరాజపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు, బైకు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను తరిగొప్పులకు చెందిన వెంకటయ్య(51), ప్రవీణ్(22)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
Two killed in Road accident At Jangaon District
- Advertisement -