- Advertisement -
రంగారెడ్డి: జిల్లాలోని యాచారం మండలం తమ్మలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం సంభవించింది. తమ్మలోని గూడ గేట్ వద్ద ఆర్టీసీ బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నానక్ నగర్ కు చెందిన జంగయ్య, రమేశ్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఎన్ని చర్యలు తీసుకువచ్చిన వాహనదారులలో మార్పు రావడంలేదని పోలీసులు చెబుతున్నారు. అతివేగంతో బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల తెలిపారు.
Two Killed in Road Accident At Rangareddy
- Advertisement -