Thursday, April 25, 2024

బైకును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two killed in road accident in Hyderabad

హైదారబాద్: నగరంలోని మియాపూర్ మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డైట్ సెట్ పరీక్ష రాయడానికి బైక్ పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. తీవ్రంగా యువతి అక్కడికక్కడే మృతి చెందగా… ఆస్పత్రికి తరలిస్తుండగా యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బిహెచ్ఇఎల్ నుంచి కూకట్ పల్లి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. మృతులను జహీరాబాద్ కు చెందిన శ్రీనివాస్, శ్వేతగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News