Tuesday, April 23, 2024

కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు యువకుల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: జిల్లాలోని రాజంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బైక్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని రాజంపేట, భిక్కనూరు మండలాలకు చెందిన ఇద్దరు యువకులు హైదరాబాద్ లో ప్రైవేటు జాబు చేస్తున్నారు. అయితే, వీరు రెండు రోజుల క్రితం రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి వచ్చారు. తిరిగి ఈరోజు ఉదయం హైదరాబాద్ వెళ్తున్న సమయంలో చేగుంట వద్ద గుర్తుతెలియని ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు సంఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిని రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన బందెల రవీందర్(22), భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన రాజేందర్(21)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Two killed in Road Accident in Kamareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News