Thursday, April 25, 2024

మంచిర్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల దుర్మరణం

- Advertisement -
- Advertisement -

One killed in Road Accident in Mancherial

మంచిర్యాల: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్ చెక్ పోస్టు వద్ద నిన్న అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి బైక్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Two Killed in Road Accident in Mancherial

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News