- Advertisement -
ఖమ్మం: ఆగివున్న టిప్పర్ను ఓ స్కూటీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన కామేపల్లిలో చోటుచేసుకుంది. కామేపల్లి మండలం పెద్దాపురం వద్ద రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్ను స్కూటీ వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన కుసుమ రాజు, హైదరాబాద్కు చెందిన కర్రి మాలతి అక్కడిక్కడే మరణించారు. వీరు ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
- Advertisement -