Friday, March 29, 2024

బావిలో పూడిక తీస్తుండగా క్రేన్ పడి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Labour dead in Crane incident in Siddipet

 

సిద్దిపేట: బావిలో కూలీలు పూడిక తీస్తుండగా క్రేన్ పడడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం భల్లూనాయక్ తండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దేవోజీ అనే రైతు తన బావి కూడిపోవడంతో కూలీలు సహాయంతో 15 రోజుల నుంచి పూడిక తీస్తున్నాడు. బావిలోని బండరాయిని బయటకు తీస్తుండగా క్రేన్ అమాంతం పైకి లేచి బావిలో పడిపోయింది. బావిలో ఉన్న కూలీలు బీమా(55), శాంతి(35) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇస్లావత్ వెంకన్న అనే కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను వరంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News