- Advertisement -
అమరావతి: పిడుగుపడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలంలో జరిగింది. కాండ్రకోట గ్రామానిక చెందిన బాబు రావు(50), కోలా వెంకటరమణ (39) తిమ్మాపురంలో వరి పొలంలో కలుపు తీస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపడడంతో ఇద్దరు కూలీలు విగతజీవులుగా పడిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
- Advertisement -