Thursday, April 18, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు మృతి

- Advertisement -
- Advertisement -

Two Lorry Drivers Died in Road Accident at Nalgonda

చిట్యాల: నల్లగొండ జిల్లాలోని చిట్యాల మండలం గుండ్రంపల్లిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ టైర్లు చెక్ చేస్తుండగా డ్రైవర్ ను మరో లారీ వేగంగా వచ్చి అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో లారీ డ్రైవర్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం తర్వాత లారీ వదిలేసి పారిపోతుండగా అటుగా వచ్చిన కారు ఢీకొని మరో డ్రైవర్ మృతి చెందాడు. బహుశా దీనినే అంటారు కాబోలు విధి రాతను ఎవరు తప్పించుకోలేరని పెద్దల మాట. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News