Saturday, April 20, 2024

ఆగి ఉన్న ట్రాక్టర్‌ని ఢీకొట్టిన బైక్: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two members dead in Bike collided to tractor

తిమ్మాజీపేట: నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీ పేట మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లక్ష్మణ్ నాయక్, రాములు నాయక్, మల్లయ్య అనే ముగ్గురు వ్యక్తులు గొర్లను కొనుగోలు చేయడానికి బైక్‌పై కల్వకుర్తికి వెళ్తున్నప్పుడు ఊరుకొండ గ్రామ శివారులో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనా స్థలంలో ఇద్దరు మృతి చెందగా తీవ్రంగా గాయపడిన మల్లయ్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News