Friday, April 26, 2024

బంజారాహిల్స్‌లో కారు బీభత్సం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead in Car accident in Hyd

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి మద్యం పూటుగా తాగి కారు నడపడంతో ఇద్దరు ఘటనా స్థలంలో మృతి చెందారు. మృతులు అయోద్యరామ్, దేబంద్రకుమార్‌గా గుర్తించారు. వీరు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టు గుర్తించారు. కారుతో పాటు నిందితుడు పారిపోయాడు. కారును గుర్తించామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News