- Advertisement -
మేడ్చల్: లారీని కారు ఢీకొట్టిన సంఘటన మేడ్చల్ జిల్లా కీసరలోని ఔటర్ రింగ్ రోడ్డుపై బుధవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కారు అతివేగంగా దూసుకొచ్చి లారీని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృత్యువాతపడ్డారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -