- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యానులో పెళ్లి బృందం ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని వ్యానులో నుంచి తీయడానికి కట్టర్లను ఉపయోగించారు. తిరుపతిలో పెళ్లి కుమారుడి బంధువులు వివాహం ముగించుకొని తెనాలికి వస్తుండగా ఈప్రమాదం జరిగింది. తెనాలిలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో పెళ్లి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
- Advertisement -