- Advertisement -
మద్దూరు: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ను ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పేరపళ్ల తండాకు చెందిన సీత్యానాయక్(70), కొత్తపల్లి తండాకు చెంది సోమ్లానాయక్ (25) పేరపళ్ల నుంచి మద్దూరుకు వస్తుండగా ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలో చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
- Advertisement -