Saturday, September 30, 2023

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

 

సిద్దిపేట: బైక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లాలోని మద్దూరు మండలం నరసాయపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వెంకట్ రెడ్డి చెరువు వద్ద ఇద్దరు యువకులు బైక్ వెళ్తుండగా చెరువు కట్ట పైనుంచి కాలువలో పడ్డారు. ఇద్దరు యువకులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పెద్దమ్మగడ్డకు చెందిన కనికరం మహేష్, జీవన్‌లుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News