Friday, March 29, 2024

సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా గచ్చిబౌలి గౌతమి ఎన్ క్లేవ్ లో ని హేమ దుర్గ అపార్ట్మెంట్ లో సెప్టిక్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి దిగిన ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన “డయల్ ఏ సెప్టిక్ ట్యాంక్” తరపు నుంచి వచ్చిన సిబ్బంది లోని అంజి (30) శ్రీను(32) అనే ఇద్దరు కూలీలు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరాడక చనిపోయారు. మరో ఇద్దరు అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సైదాబాద్ సింగరేణి కాలనీ చెందిన వారీగా గుర్తించారు. మాదాపూర్ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. సెప్టిక్ ట్యాంక్ విష వాయువులు వెలువడడంతో మృతి చెందారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News