Friday, March 29, 2024

అడవిలో కరెంట్ తీగలు తగిలి: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two Members dead with current shock

దమ్మపేట: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం రంగువారిగుడెం శివారులో అడవి జంతువుల కోసం పెట్టిన కరెంట్ తీగలు తగలడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంగువారిగూడెం గ్రామానికి చెందిన పొద్దుటూరి డానియల్, డానియల్ కుమారుడు బాలు, డానియల్ సోదరుడు విజయ్ లు రాత్రి అడవికి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు అడవి జంతువుల వేటకోసం అమర్చిన కరంటు తీగలకు తగిలి డానియల్ బాలు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. గాయపడిన విజయ్ అశ్వారావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News