Wednesday, April 24, 2024

కాగజ్ నగర్ లో నడిరోడ్డుపై యువకుడిని పొడిచి…

- Advertisement -
- Advertisement -

 

 

మనతెలంగాణ/కాగజ్‌నగర్‌: శనివారం రాత్రి కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా  కాగజ్‌నగర్ పట్టణంలోని సర్దార్ బస్తిలో యువకుడి హత్య చేశారు. కాగజ్‌నగర్ ఎస్‌హెచ్‌ఓ బి మోహన్ తెలిపిన వివరాల ప్రకారం… సర్దార్ బస్తికి చెందిన జాడి జశ్వంత్ (16) ను అదే బస్తీకి చెందిన ప్రవీణ్ హత్య చేసినట్లు తెలిపారు. ఇద్దరి మద్యలో మాట మాట పెరిగి చిన్న గోడవ జరగగానే ప్రవీణ్ ఇంట్లోకి వెళ్లి కత్తీ తీసుకువచ్చి జశ్వంత్‌పై దాడి చేసి చంపినట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుడి మేనత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కాగజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు.

 

Two members fight after murdered in Kagajnagar
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News