ఇద్దరికి తీవ్రగాయాలు
మన తెలంగాణ/హవేళిఘనపూర్: మెదక్ జిల్లా హవేళిఘన్ పూర్ మండల పరిధి నుండి బోధన్కు వెళ్లే ప్రధాన రహదారిలో నాగపూర్ గ్రామ గేట్ వద్ద ఆర్టీసీ బస్సును బైక్ డీ కొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజంపేట మండలం పోతమీర్గడ్డ గ్రామానికి చెందిన బానోత్ ప్రవీణ్(25), దరావత్ వినోద్(20)లు టిఎస్ 17 డి 7691 గ్లామర్ బైక్పై హవేళిఘనపూర్ వైపు నుండి తమ గ్రామానికి వెళ్తుండగా నాగాపూర్ గేట్ వద్ద కామారెడ్డి డిపోకు చెందిన ఎపి 29జడ్ 3824 నెంబర్ గల ఆర్టీసి బస్సు గుండారం నుండి మెదక్ వైపు వస్తుండగా బైక్ ను ఢీ కొనడంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను 108 వాహనం ద్వారా మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ బానోత్ ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించినట్టు వివరించారు. క్షతగాత్రుడు ప్రవీణ్ భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ శేఖర్గౌడ్ తెలిపారు.