- Advertisement -
నాగర్ కర్నూల్: జిల్లాలో మరో ఇద్దరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. బల్మూర్ మండలం వీర రామాజిపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల కరోనాతో మృతి చెందాడు. దీంతో, అతడి అంత్యక్రియలకు హాజరైన అదే గ్రామానికి చెందిన 14 మంది శాంపిల్స్ సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించారు. పరీక్షల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా, మిగతా12 మందికి కరోనా నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని.. అనవసరంగా బయటకు రావొద్దని, కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రజలకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Two men tests positive for corona in Nagarkurnool
- Advertisement -