Thursday, March 28, 2024

రెండు నెలల చిన్నారిని హత్య చేసిన దుండగులు

- Advertisement -
- Advertisement -

Two month old baby murder in Ranga Reddy

అబ్దుల్లాపూర్‌మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. రెండు నెలల చిన్నారిని చంపేసి ఇంటిపైన ఉన్న నీటి ట్యాంకులో పడేశారు దుండగులు. తెల్లవారుజామునుంచి పసిబిడ్డ కనిపించడం లేదంటూ గాలించిన తల్లిదండ్రులు చివరకు పోలీసులకు ఆశ్రయించారు. అనాజ్ పూర్ లో సిసి కామెరా ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు చిన్నారి అచూకీ లభించకపోవడంతో ఇంటి పైన వెతికారు. నీటి ట్యాంకులో పసికందు మృతదేహం గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిని ఎసిపి పురుషోత్తం పరిశీలించారు. చిన్నారి మేనమామ, అత్తను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కుటుంబకలహాలే చిన్నారి హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారిని చంపేసి ఇంటిపైన ట్యాంకులో పడేసిన నిందితుల కోసం గాలిస్తున్నామని ఎసిపి స్పష్టం చేశారు.

Two month old baby murder in Ranga Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News