Thursday, April 25, 2024

మరో ఇద్దరు టీమిండియా క్రికెటర్లకు కరోనా

- Advertisement -
- Advertisement -

Two more Indian cricketers test Covid positive

 

కొలంబో: శ్రీలంక సిరీస్‌లో పాల్గొన్న టీమిండియాలో మరో ఇద్దరు క్రికెటర్లకు కరోనా ఉన్నట్టు తేలింది. భారత స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌తో పాటు యువ ఆటగాడు కృష్ణప్ప గౌతమ్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్‌కు చెందిన అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే భారత ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో చివరి రెండు ట్వంటీ20 మ్యాచ్‌లలో కీలక ఆటగాళ్లు లేకుండానే టీమిండియా బరిలోకి దిగాల్సి వచ్చింది. దీని ప్రభావం భారత ఆటపై స్పష్టంగా కనపడింది. చివరికి టి20 సిరీస్‌ను కూడా భారత్ కోల్పోవాల్సి వచ్చింది. ఇదిలావుండగా కృనాల్ పాండ్యతో సన్నిహితంగా 8 మంది క్రికెటర్లను ఐసోలేషన్‌కు తరలించారు. ఈ జాబితాలో ఉన్న చాహల్, కృష్ణప్ప గౌతమ్‌లకు కోవిడ్ ఉన్నట్టు తేలడంతో టీమిండియాలో మరోసారి కలకలం రేగింది. అయితే సమీప భవిష్యత్తులో ఎలాంటి సిరీస్‌లు లేకపోవడంతో భారత్‌కు పెద్దగా వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కాగా చాహల్, గౌతమ్‌లు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. సిరీస్ ముగిసినా వీరిద్దరూ మరికొన్ని రోజుల పాటు శ్రీలంకలోనే ఉండిపోక తప్పదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News