- Advertisement -
న్యూయార్క్: ఇద్దరు ఎన్ఆర్ఐ పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన అమెరికాలోని లాస్ ఎంజెల్స్లో జరిగింది. అమెరికా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం బండ్లగూడెం గ్రామానికి చెందిన చెట్టిపల్లి రామచంద్రారెడ్డి 20 సంవత్సరాల నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు. భార్య రజిత, పిల్లలు అక్షరారెడ్డి, ఆర్జిత్ రెడ్డిలతో డిసెంబర్ 18న ఫ్యామిలీ గెట్ టూ గెదర్ కు వెళ్లారు. వేడుక ముగిసిన తరువాత లాస్ ఎంజెల్స్కు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఆర్జిత్ రెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అక్షర రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. రామచంద్రారెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల పట్ల అమెరికన్ ఎన్ఆర్ఐలు సంతాపం తెలిపారు.
- Advertisement -