Thursday, April 18, 2024

వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి

- Advertisement -
- Advertisement -

Two people were killed in separate incidents

 

మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా ప్రతినిధి/దోమ: వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు సంఘటనల్లో యువతి, యువకుడు మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దోమ మండలం గుండాల్ గ్రామానికి చెందిన కృష్ణ హైదరాబాద్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో పని చేసుకుంటూ స్వగ్రామానికి వచ్చాడు. ఈ మధ్య కాలంలో గ్రామంలోనే ఉండేవాడు. ఆదివారం గండీడ్ మండలంలోని వెన్నాచెడ్ గ్రామ సమీపంలోని చెరువులో పడి కృష్ణ మృతి చెందాడని పోలీసుల తెలిపిన సమాచారం మేరకు వివరాలు తెలిశాయి. కాగా గుండాల్ గ్రామానికి చెందిన యువతి సుజాత ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలు గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధ పడుతుండేదని మృతురాలు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. కాగా గ్రామంలో యువకుడు కృష్ణ(25) యువతి సుజాత (18) గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని ఇరువురి కుటుంబ పెద్దలు వీరి ప్రేమను వ్యతిరేకించడంతో ఇద్దరు వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. కాగా పూర్తి వివరాలను పోలీసులు వెళ్లడించకుండా గోప్యంగా ఉంచుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News