- Advertisement -
జమ్మూకశ్మీర్: శ్రీనగర్ శివారు నౌగామ్ ప్రాంతంలో శుక్రవారం ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిగిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందగా.. మరొకరికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఈ సంఘటన జరగడం స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ‘నౌగాన్ బైపాస్ రోడ్డులో పోలీసులపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించాం. చికిత్స పొందుతున్న సమయంలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు’ అని ఉన్నాతాధికారులు తెలిపారు. కాగా, గురువారం నాడు కశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు కలిసి దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లా అవాండిపోరాలో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Two Police personnel lost their lives and one injured
- Advertisement -