లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఇద్దరు సాధువులను హత్య చేసిన సంఘటన కలకలం సృష్టించింది. బులంద్ షహర్ జిల్లా పాగొనా గ్రామంలోని శివాలయంలో జగన్నాథ్ దాస్ (55), సేవాదాస్(35) అనే ఇద్దరు సాధువులు దేవునికి పూజలు చేస్తూ ఉండేవారు. సాధువులిద్దరు రక్తపు మడుగులో కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాధువుల వద్ద నుంచి ఓ వ్యక్తి విలువైన వస్తువులను దొంగతనం చేశాడు. దీంతో సాధువులు సదరు దొంగను తిట్టారు. ఆ దొంగ వారిపై పగ పెంచుకొని హత్య చేసి ఉంటారని స్థానిక పోలీస్ అధికారి సంతోష్ సింగ్ అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. సాధువుల హత్యపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ యంత్రాంగానికి సూచించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.