- Advertisement -
జనగామ : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారులు ఇద్దరు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పోచన్నపేట గ్రామంలో నూనె జక్కరయ్య (7), పాలయ్య (7) అనే విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Two students killed by fall in pond
- Advertisement -