- Advertisement -
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని అనంత్ నాగ్ లో మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. వాఘమా సరిహద్దు వద్ద తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో సిఆర్ పిఎఫ్ బలగాలు అక్కడి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రత బలగాల కదలికలను గమనించిన తీవ్రవాదులు కాల్పులు జరపడంతో సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సిఆర్ పిఎప్ జవాన్లు గాయపడినట్టు సమాచారం.
- Advertisement -