Tuesday, March 19, 2024

పుల్వామాలో ఎన్ కౌంటర్: ఇద్దరు తీవ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

Two terrorist dead in Pulwama encounter

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సోమవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరాలోని సాంబూరాలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఘటనా స్థలం నుంచి భారీగా మందు గుండు సామాగ్రి, ఎకె 47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు తీవ్రవాదులు లష్కర్ తోయేబా గ్రూప్ నకు చెందిన వారిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News